Modugula Venugopal Reddy: పక్కాగా టార్గెట్ చేసి నాపై దాడి చేశారు: మోదుగుల

  • టీడీపీ దొంగ ఓట్లు వేయించింది
  • దీన్ని ప్రశ్నించినందుకే నాపై దాడి చేశారు
  • దీని వెనుక పోలీసుల వైఫల్యం కూడా ఉంది
Modugula response on attack on him

గుంటూరులో మాజీ ఎంపీ, వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. నగరంలోని జేకేసీ కాలేజీ వద్ద ఆయన కారుపై టీడీపీ వర్గీయులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఆయన కారుతో పాటు, మరో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో మోదుగులకు స్వల్ప గాయాలు అయ్యాయి.

ఈ నేపథ్యంలో మోదుగుల స్పందిస్తూ, టీడీపీ దొంగ ఓట్లు వేయించడాన్ని ప్రశ్నించినందుకే తనపై దాడి చేశారని అన్నారు. మహిళలు, విద్యార్థినులతో టీడీపీ దొంగ ఓట్లు వేయించిందని చెప్పారు. పక్కాగా టార్గెట్ చేసే, తనపై దాడి చేశారని మండిపడ్డారు. ఈ దాడి వెనుక గుంటూరు పోలీసుల వైఫల్యం కూడా ఉందని ఆరోపించారు. మరోవైపు ఈ దాడి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

More Telugu News