West Bengal: బెంగాల్ కార్మికశాఖ మంత్రి జాకీర్ హుస్సేన్‌పై బాంబుదాడి.. పరిస్థితి విషమం

  • కోల్‌కతా వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌లో మంత్రి ఎదురుచూపు
  • బాంబులు విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
West Bengal Minister injured in bomb attack in Murshidabad

పశ్చిమ బెంగాల్ కార్మిక శాఖ మంత్రి జాకీర్‌ హుస్సేన్‌పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. గత రాత్రి 10 గంటల సమయంలో కోల్‌కతా వెళ్లేందుకు ముర్షిదాబాద్ జిల్లాలోని నిమ్తితా రైల్వే స్టేషన్‌లో మంత్రి వేచి చూస్తున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆయనపై బాంబులు విసిరారు.

బాంబు పేలుళ్లతో రైల్వే స్టేషన్ దద్దరిల్లింది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మంత్రిని జంగీపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మంత్రితోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. మంత్రి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News