Road Accident: కర్నూలు జిల్లాలో ఘోరం... టెంపో, లారీ ఢీకొనగా 14 మంది దుర్మరణం!

  • ఈ తెల్లవారుజామున ప్రమాదం
  • వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఘటన
  • అదుపుతప్పిన టెంపోను ఢీకొన్న లారీ
Road Accident in Kurnool District

కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 14 మంది ప్రాణాలను బలిగొంది. వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఈ ఘటన జరిగింది. చిత్తూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఓ టెంపో రహదారిపై అదుపు తప్పి, కుడివైపునకు పడిపోగా, ఆ దిశగా వస్తున్న ఓ లారీ టెంపోను ఢీకొంది.

ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు 8 మంది మహిళలు ఉన్నారు. టెంపో డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

More Telugu News