పెసర్లంకలో గెలిచిన వారిపై దాడి గర్హనీయం: నాదెండ్ల మనోహర్
- పోలీసుల భాష గ్రామస్థుల మనోభావాలను దెబ్బతీసింది
- నిబంధనలు అందరికీ ఒకే రీతిన అమలు చేయాలి
- సత్తెనపల్లిలో జనసేన జెండా దిమ్మెను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నాం
అన్ని పార్టీలకు నిబంధనలను ఒకే రీతిలో అమలు చేస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదని అన్నారు. కేవలం జనసేనకు, జనసేన మద్దతుదారులకు మాత్రమే నిబంధనలను వర్తింపజేస్తామంటే మాత్రం అభ్యంతరాలను వ్యక్తం చేస్తామని చెప్పారు.
ప్రజా క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సేవ చేయడం వల్లే జనసేనకు ఓటర్ల ఆదరణ దక్కిందని అన్నారు. సత్తెనపల్లిలో జనసేన పార్టీ జెండా ఉన్న దిమ్మెను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. దీనికి కారకులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ మేరకు నాదెండ్ల మనోహర్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.