AIADMK: శశికళ వచ్చినా మాకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు: బీజేపీ జాతీయ కార్యదర్శి రాజా

  • అన్నాడీఎంకే పార్టీకి, ప్రభుత్వానికి శశికళతో ఇబ్బంది లేదు
  • ఈ పదేళ్లలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి  సాధించింది
  • మోదీ చొరవతో రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు
We have no problem with Shashikala BJP national secretary Raja

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనంతరం విడుదలైన శశికళ చెన్నై చేరుకున్నారు. మద్దతుదారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రియాశీల రాజకీయాల్లో ఉంటానని చెప్పడంతో తమిళ రాజకీయాల్లో వేడి మొదలైంది. అధికార అన్నాడీఎంకే మాత్రం ఆమెను చేర్చుకునేది లేదని తెగేసి చెబుతుండగా, దినకరన్ మాత్రం అన్నాడీఎంకేపై శశికళ మళ్లీ పట్టు సాధిస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు, ఆమె రాకతో అధికార అన్నాడీఎంకేకు కానీ, ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా పేర్కొన్నారు. నిన్న ఆయన విల్లుపురంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వ చొరవ కారణంగా తమిళ ప్రభుత్వానికి మరిన్ని సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పదేళ్లలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించిందని రాజా వివరించారు.

More Telugu News