Nirmala Sitharaman: 2021-22 కేంద్ర బడ్జెట్ హైలైట్స్.. జల జీవన్‌ మిషన్‌కు రూ. 2,87,000 కోట్లు

  • వ్యక్తిగత వాహనాల జీవితకాలం20 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారణ
  • రక్షిత మంచినీటి పథకాల కోసం రూ. 87 వేల కోట్లు
  • రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
Union budget highlights

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెడుతున్నారు. 'నెవర్ బిఫోర్' బడ్జెట్ ను ఈసారి ప్రవేశ పెడుతున్నట్టు ఈ సంద్భంగా ఆమె చెప్పారు.

బడ్జెట్ హైలైట్స్:

  • ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్‌లో పొందుపరిచాం  
  • అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం
  • లాక్‌డౌన్‌ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యం ఇచ్చాం
  • జల జీవన్‌ మిషన్‌కు రూ. 2,87,000 కోట్లు కేటాయింపు
  • కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కోసం రూ. 35,400 కోట్లు
  • పర్యావరణ హితంగా వాహనాలు ఉండాలన్నది లక్ష్యం
  • వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారణ
  • 6 సంవత్సరాలకు గాను రూ. 64,180 కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్‌ యోజన పేరుతో కొత్త పథకం
  • నేషనల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ సిస్టం మరింత పటిష్టం, దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు 
  • ఆరోగ్య రంగానికి పెద్దపీట 
  • 100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం
  • కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం
  • మెగా ఇన్వెస్ట్‌మెంట్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌
  • కొత్తగా బీఎస్‌ఎల్‌-3  ప్రయోగశాలలు 9 ఏర్పాటు
  • వాహన పొల్యూషన్‌ను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి 
  • రక్షిత మంచినీటి పథకాల కోసం రూ. 87 వేల కోట్లు
  • 2 కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు
  • 64,150 కోట్లతో ఆత్మనిర్భర భారత్‌ 
  • రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

More Telugu News