Hyderabad: ముంబై స్టేషన్ లో పట్టాలు తప్పిన హైదరాబాద్ స్పెషల్ రైలు

  • రాత్రి పదిగంటల సమయంలో ఘటన
  • ప్రయాణికులు సేఫ్
  • ఘటన తర్వాత మూడు రైళ్లను కుదించిన అధికారులు
Special train trolley derails from Chhatrapati Shivaji Maharaj Terminus

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ)లో హైదరాబాద్ స్పెషల్ రైలు పట్టాలు తప్పింది. గత రాత్రి స్టేషన్ టెర్మినల్ నుంచి రైలు బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రాత్రి పది గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని, ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు.

పట్టాలు తప్పిన రైలును రిలీఫ్ రైలు సాయంతో అక్కడి నుంచి తరలించారు. ఈ  ఘటనతో అధికారులు మూడు రైళ్లను కుదించారు. నాందేడ్-సీఎస్ఎంటీ స్పెషల్ రైలు (07617)ను బైకుల్లా వరకు, లక్నో-సీఎస్ఎంటీ (02533) రైలును దాదర్ వరకు, కర్మాలి-సీఎస్ఎంటీ (02120) రైలును థానే వరకు కుదించినట్టు అధికారులు తెలిపారు.

More Telugu News