తమిళనాడులో కొత్త పార్టీని ప్రారంభించనున్న రజనీకాంత్ సన్నిహితుడు!
- కొత్త పార్టీని పెడుతున్న అర్జునమూర్తి
- పోయెస్ గార్డెన్ లో సభను ఏర్పాటు చేయనున్న వైనం
- రజనీ ఆశీర్వాదాలు తనకు ఉన్నాయన్న అర్జునమూర్తి
గతంలో తమిళనాడు బీజేపీ మేధో విభాగం అధ్యక్షుడిగా అర్జునమూర్తి పని చేశారు. ఆ తర్వాత రజనీ పార్టీలో చురుకుగా వ్యవహరించారు. రజనీ రాజకీయాల్లోకి రానని ప్రకటించిన నేపథ్యంలో, తానే కొత్త పార్టీ పెట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. పోయెస్ గార్డెన్ లో త్వరలోనే సభను ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రజనీ ఆశీర్వాదాలు తనకు ఉన్నాయని, ఆయన అభిమానులు తనను ఆదరిస్తారని భావిస్తున్నానని చెప్పారు.