Data: తమిళనాడులో విద్యార్థులకు రోజుకు 2జీబీ డేటా ఫ్రీ

Free data for students in Tamilnadu
షార్ట్స్‌లో చూడండి
కరోనా వ్యాప్తి ప్రభావంతో ప్రపంచమంతా మారిపోయింది. విద్యావ్యవస్థ ఆన్ లైన్ బాట పట్టింది. ఆన్ లైన్ అన్న తర్వాత ఇంటర్నెట్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్న విద్యార్థులకు రోజుకు 2 జీబీ డేటా ఉచితంగా ఇస్తున్నట్టు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఇవాళ ప్రకటించారు. ఈ ఉచిత పథకంతో  9 లక్షల మందికి పైగా కాలేజీ విద్యార్థులు లబ్ది పొందుతారని తెలుస్తోంది.

జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ పథకం వర్తించనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు, ప్రైవేటు కాలేజీల్లో చదువుతూ ఉపకారవేతనాలు పొందుతున్న విద్యార్థులు ఈ ఉచిత డేటా పొందవచ్చని సీఎం పళనిస్వామి ఓ ప్రకటనలో తెలిపారు.

ఉచిత డేటాకు సంబంధించిన రీచార్జి కార్డులను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ (ఈఎల్ సీఓటీ) ద్వారా పంపిణీ చేస్తామని వివరించారు. విద్యార్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అంతేగాకుండా, ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్ టాప్ లు కూడా అందిస్తోందని తెలిపారు.
Go Back to Shorts
Data
Free
Students
Edappadi Palaniswami
Tamilnadu
Corona Virus

More Telugu News