bird flu: దేశంలో బర్డ్ ఫ్లూ విజృంభణపై రాష్ట్రాలను అప్ర‌మ‌త్తం చేసిన‌ కేంద్ర స‌ర్కారు

  • మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లో బ‌ర్డ్ ఫ్లూ
  • వేలాది కాకులు, బాతులు మృతి
  • ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల‌న్న కేంద్రం
  • కేంద్ర పాడి పశుసంవర్థకశాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
central govt alerts state on bird flu

మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లో బ‌ర్డ్ ఫ్లూ విజృంభిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే వేలాది కాకులు, బాతులు మృతి చెందాయి. హ‌ర్యానాలోని పంచకుల జిల్లాలో గత పది రోజుల్లో 4 లక్షలకుపైగా కోళ్లు మరణించగా,  వాటిలో బర్డ్‌ ఫ్లూ వైరస్ నిర్ధారణ కాలేదని అధికారులు చెప్పారు.

పలు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ అనుమానిత కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాల‌కు కేంద్ర ప్రభుత్వం ప‌లు సూచ‌న‌లు చేసింది.  వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించింది. పరిస్థితుల‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని,  అలాగే వైర‌స్ నివారణ చర్యలు తీసుకోవాల‌ని చెప్పింది.

పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర పాడి పశుసంవర్థకశాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించింది. కాగా, కేరళలో ఇతర ప్రాంతాలకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా కోళ్లు, బాతులను చంపే ప్రక్రియను అధికారులు చేప‌ట్టారు.

More Telugu News