Pawan Kalyan: ఈ నెల 9న దివిస్ ఫార్మా కంపెనీ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ బహిరంగ సభ

  • తుని నియోజకవర్గంలో దివిస్ ఫార్మా కంపెనీ ఏర్పాటు
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రజలు
  • ఆందోళనలకు మద్దతు పలికిన పవన్
  • ఈ నెల 9న తుని నియోజకవర్గంలో పర్యటన
Pawan Kalyan will attend a rally in Tuni constituency

తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో దివిస్ ఫార్మా పరిశ్రమ ఏర్పాటును అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తుని నియోజకవర్గ ప్రజల ఆందోళనలకు పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. ఈ క్రమంలో దివిస్ ఫార్మా కంపెనీ ప్రభావిత ప్రాంతాల్లో జనవరి 9న పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభలో పాల్గొంటారని జనసేన పార్టీ వెల్లడించింది. పవన్ తొలుత దివీస్ ఫార్మా పరిశ్రమ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలను, ఇటీవల పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన వారిని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారని జనసేనాని రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

More Telugu News