punjab: పంజాబ్ సీఎం తలకు మిలియన్ డాలర్ల నజరానా.. కేసు నమోదు

  • వాల్‌పోస్టర్‌ అంటించిన నిందితుడు
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • వాల్ పోస్టర్‌లో ఈ-మెయిల్ ఐడీ గుర్తింపు
Poster Offers 10 Lakh Dollars For Killing Punjab CM Amarinder Singh

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను చంపిన వారికి మిలియన్ డాలర్లు నజరానాగా ఇస్తామంటూ ఓ గోడపై కనిపించిన పోస్టర్ కలకలం రేపింది. సెక్టార్ 66-67 క్రాసింగ్ సమీపంలోని ఓ గోడకు అంటించిన గైడ్ మ్యాప్‌పై ఇలా ప్రచురించారని, దానిపై ఈ-మెయిల్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పోస్టర్ అంటించిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబరు 31న ఈ పోస్టర్ అంటించినట్టు మొహాలీ సిటీ ఎస్పీ తెలిపారు. పోస్టర్ అంటించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు.

More Telugu News