Andhra Pradesh: గత 24 గంటల్లో ఏపీలో ఒక్క కరోనా మరణం కూడా లేదు!

  • ఏపీలో ఇప్పటివరకు 7,108 కరోనా మరణాలు
  • గత 24 గంటల్లో 58,519 టెస్టులు
  • కొత్తగా 326 పాజిటివ్ కేసులు
  • అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 7 కేసులు
  • 350 మందికి కరోనా నయం
AP witnessed no deaths in last twenty four hours

కరోనా వ్యాప్తి ప్రారంభమైన తర్వాత ఏపీలో ఇప్పటివరకు 7,108 మంది మృతి చెందారు. నిత్యం పలు జిల్లాల్లో ఎక్కడో ఒక చోట కరోనా మరణాలు సంభవిస్తుండేవి. అయితే, గత 24 గంటల్లో ఏపీలో ఒక్కరు కూడా కరోనాతో మరణించలేదు. తాజా బులెటిన్ లో ఈ మేరకు వెల్లడైంది.

గడచిన 24 గంటల్లో 58,519 కరోనా పరీక్షలు నిర్వహించగా 326 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 53, తూర్పు గోదావరిలో 45, చిత్తూరులో 44 కేసులు గుర్తించారు. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 7, శ్రీకాకుళంలో 8, విజయనగరం జిల్లాలో 8 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 350 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,82,612 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,72,266 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,238 మందికి చికిత్స కొనసాగుతోంది.

More Telugu News