నైట్ కర్ఫ్యూ ఆదేశాలను ఉపసంహరించుకున్న కర్ణాటక ప్రభుత్వం
- బ్రిటన్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభణ
- భారత్ లోనూ కలకలం
- నైట్ కర్ఫ్యూ అంటూ నిన్న ఆదేశించిన కర్ణాటక
- మరోసారి సమీక్ష
- తాజాగా ప్రకటన చేసిన సీఎంఓ
"నిపుణుల హెచ్చరికల మేరకు కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇంతక్రితం నైట్ కర్ఫ్యూ ఆదేశాలు ఇచ్చాం. అయితే ప్రజానీకం నుంచి వస్తున్న స్పందనలతో మరోసారి సమీక్షించాం. దీనిపై కేబినెట్ సహచరులు, సీనియర్ అధికారులతో చర్చించి నైట్ కర్ఫ్యూ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నాం" అని వివరించింది. అయితే, ప్రజలు భౌతికదూరం, మాస్కులు, శానిటైజర్ల వినియోగం వంటి నిబంధనలు పక్కాగా పాటించాలని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.