Tirumala: 22న తిరుమలలో ఆలయ శుద్ధి, భక్తుల దర్శనాలకు ఆటంకాలు!

  • 25న వైకుంఠ ఏకాదశి పర్వదినం
  • కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్న టీటీడీ
  • ఆ తరువాత వైకుంఠ ద్వారాల అలంకరణ
Koil Alwar Tirumanjanam in Tirumala On 22nd

ఈ నెల 25న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా, 22న తిరుమల ఆలయంలో శుద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్నామని టీటీడీ ప్రకటించింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, మూలికలు, నీటితో ఆలయంలోని అన్ని ప్రాంతాలను శుభ్రం చేయనున్నామని, ఈ సందర్భంగా మంగళవారం నాడు దర్శనాలకు ఆటంకం ఏర్పడనుందని తెలిపారు. ఉదయం 12 గంటల నుంచి భక్తులకు దర్శనాలు ఉంటాయని స్పష్టం చేశారు. తిరుమంజనం తరువాత వైకుంఠ ద్వారాల అలంకరణ పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.

More Telugu News