Rajasthan: రాజస్థాన్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిపై కూలిన పిల్లర్.. వీడియో ఇదిగో

  • ఓ పిల్లర్‌ నిర్మాణం జరుగుతుండగా ప్రమాదం
  • ఒకరి తలపై అది నేరుగా పడిన వైనం
  • రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని ఓ మార్కెట్‌లో ఘటన 
An under construction pillar in a market in Rajasthan

ఇద్దరు వ్యక్తులు రోడ్డుపక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఓ పిల్లర్‌ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో అది ఒక్కసారిగా కూలిపోయి వారిపై పడిపోయింది. ఆ ఇద్దరిలో ఒకరి తలపై అది నేరుగా పడడంతో అక్కడికక్కడే అతడు కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలపాలై లేవలేని స్థితిలో ఉన్న అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అతడితో ఉన్న మరో వ్యక్తి కుడి చేతికి స్వల్పగాయమైంది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని ఓ మార్కెట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.

ఓ దుకాణానికి సంబంధించిన నిర్మాణ పనులు కొనసాగుతుండగా, మూడో అంతస్తు నుంచి ఓ స్తంభం కూలిపడడంతో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు మీడియాకు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స అందుతోందని, ఆ దుకాణ యజమానితో మాట్లాడడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

More Telugu News