Jagan: రేపు ఢిల్లీకి వెళుతున్న ముఖ్యమంత్రి జగన్

  • పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న జగన్
  • రేపు రాత్రి 9 గంటకు అమిత్ షాతో భేటీ
  • పోలవరం నిధుల గురించి చర్చించే అవకాశం
Jagan is going to Delhi tomorrow

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. విజయవాడ నుంచి హస్తినకు ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు.

ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కీలకమని తెలుస్తోంది. రేపు రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ అయి పలు విషయాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు నిధుల గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈరోజు జగన్ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సంగతి తెలిసిందే. పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ తెలియాల్సి ఉంది.

ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ, అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి చర్చించారు.

More Telugu News