కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు!
- అన్ని పడకలకూ ఆక్సిజన్ సౌకర్యం
- అదనంగా మరో 5 వేల పడకల ఏర్పాటు
- మౌలిక వసతులను సిద్ధం చేసుకోవాలని సూచన
- కేసీఆర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం
అన్ని ఆసుపత్రుల్లో కలిపి మరో 5 వేల అదనపు పడకలను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో ఎదుర్కొన్న సంక్షోభ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, మరోమారు ఆ పరిస్థితి ఏర్పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి గాంధీ ఆసుపత్రి వరకూ కరోనా చికిత్సలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలనూ సిద్ధంగా ఉంచాలని, వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.