Delhi: దళిత యువతిని పెళ్లి చేసుకున్నందుకు కొట్టి చంపేశారు!

  • ఢిల్లీ శివార్లలోని గురుగావ్ లో దారుణం
  • ఐదు నెలల క్రితం దళిత యువతిని పెళ్లాడిన యువకుడు
  • కొట్టి చంపేసిన అగ్రవర్ణానికి చెందిన యువకులు
Man Who Married Dalit Woman murdered in Gurgaon

ఢిల్లీ శివారు ప్రాంతమైన గురుగావ్ లో దారుణం చోటు చేసుకుంది. దళిత యువతిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఆకాశ్ అనే 28 ఏళ్ల అగ్రకుల యువకుడిని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు మాట్లాడుతూ, ఐదు నెలల క్రితం దళిత యువతిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి బెదిరింపులు వస్తున్నాయని చెప్పాడు. గత ఆదివారం భార్య తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ఆమెతో పాటు గురుగావ్ లోని బాద్షాపూర్ కు తన సోదరుడు వెళ్లాడని... ఆ సందర్భంగా గ్రామంలో ఆయనపై దాడి చేశారని తెలిపాడు.

ఈ కేసుకు సంబంధించి ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరు రిమాండ్ లో ఉన్నారు. ఆకాశ్ ను హత్య చేసిన ఐదుగురూ దళిత యువతి గ్రామానికి చెందినవారే. వీరు ఐదుగురు అగ్రవర్ణానికి చెందినవారు. ఈ కారణం వల్లనే గ్రామంలోకి రావద్దంటూ అతడిని హెచ్చరించారు. అయినా గ్రామంలోకి రావడంతో కొట్టి, చంపేశారు.

More Telugu News