Vijayashanti: ‘దుబ్బాక’ ఎన్నికల ముందు కూడా ఇలాగే మాట్లాడారు: కేసీఆర్‌పై విజయశాంతి విమర్శలు

  • జీహెచ్ఎంసీలో గెలుస్తామంటూ కేసీఆర్ వ్యాఖ్యలు
  • కేసీఆర్ గారివన్నీ అవకతవక సర్వేలు
  • ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గారు
  • జీహెచ్ఎంసీ ఎన్నికలు రోజుల్లోనే జరపాలని ప్రయత్నం
vijayashanti slams kcr

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు డిసెంబరు తొలివారంలోనే జరుగనున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజాగా చేసిన పలు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు.
 
‘జీహెచ్ఎంసీలో గెలుపు మాదేనంటున్న ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారివన్నీ అవకతవక సర్వేలు. దుబ్బాక ఎన్నికల ముందు కూడా ఇలాగే మాట్లాడారు. దుబ్బాక ఫలితం సానుభూతి తప్ప మరొకటి కాదని సీఎం గారు అన్నారు. ఆ సానుభూతి టీఆర్ఎస్‌కు ఎందుకు లభించలేదో కూడా చెప్పాలి. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి జీహెచ్ఎంసీ ఎన్నికలు రోజుల్లోనే జరపటానికి నిర్ణయించినట్టు కనబడుతోంది’ అని విజయశాంతి ట్వీట్లు చేశారు.

More Telugu News