Visakhapatnam District: ప్రియుడిని కిడ్నాప్ చేసేందుకు వివాహిత యత్నం.. పెనుగులాటలో యువకుడి తండ్రి మృతి

  • విశాఖపట్టణం జిల్లా తగరపువలసలో ఘటన
  • రూ. 2 లక్షలు ఇచ్చి తెగదెంపులు చేసుకున్నా మళ్లీ వచ్చిన మహిళ
  • కారులో పరారైన కిడ్నాపర్లు
woman try to kidnap his lover in Visakhapatnam dist

విశాఖపట్టణం జిల్లా తగరపువలసలో దారుణం జరిగింది. తన కుమారుడిని కొందరు కిడ్నాప్ చేసేందుకు  ప్రయత్నిస్తుండడాన్ని చూసి అడ్డుకునేందుకు వెళ్లిన తండ్రి వారితో జరిగిన పెనుగులాటలో కుప్పకూలి మరణించాడు. దీంతో కిడ్నాపర్లు అక్కడి నుంచి పరారయ్యారు.

పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన  35 ఏళ్ల మహిళ భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి తగరపువలసలోని బాలాజీనగర్‌లో నివసించేది. ఈ క్రమంలో  అదే కాలనీకి చెందిన రౌతు కృష్ణారెడ్డి (24)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది మరింత ముదరడంతో ఇద్దరూ కలిసి వెళ్లిపోయి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఈ ఘటనపై అప్పట్లో భీమిలిలో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది.

అనంతరం జరిగిన గొడవల్లో వంశీకృష్ణ తండ్రి రౌతు వెంకట్రావు (48) ఆమెకు రూ. 2 లక్షలు ఇచ్చి ఇకపై తన కుమారుడికి దూరంగా ఉండాలని పేపర్ రాయించుకున్నాడు. అయితే, నిన్న మధ్యాహ్నం వంశీకృష్ణ తన తండ్రి నిర్వహిస్తున్న చికెన్ దుకాణానికి వెళ్తుండగా, అండర్ పాస్ వంతెన కింద మరో నలుగురు యువకులతో కలిసి కాపు కాసిన సదరు మహిళ.. వంశీకృష్ణ రాగానే కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది.

గమనించిన వంశీకృష్ణ తండ్రి పరుగుపరుగున అక్కడికి చేరుకుని కుమారుడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తెగదెంపులు చేసుకున్నా మళ్లీ ఎందుకు వచ్చావంటూ మహిళను నిలదీశాడు. కుమారుడిని కిడ్నాపర్ల నుంచి తప్పించేందుకు వారితో పెనుగులాడాడు. ఈ క్రమంలో కిందపడి అక్కడికక్కడే మరణించాడు. దీంతో భయపడిన కిడ్నాపర్లు వారిని అక్కడే వదిలేసి కారులో పరారయ్యారు. వంశీకృష్ణ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News