Arvind: కేటీఆర్ వాడుతున్న భాష కూడా సరిగాలేదు: బీజేపీ ఎంపీ అర్వింద్ ఫైర్

  • దుబ్బాకలో ఏడు చెరువుల నీళ్లు తాగించాం
  • సిరిసిల్లలో నీవు ఓడిపోకపోతే అడుగు
  • మీరు తీసుకుంటున్న జీతాలు కూడా ప్రజల డబ్బే
BJP MP Arvind warns KTR

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎంపీ అర్వింద్ ఫైర్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్లు పెడుతున్నారని అన్నారు. కేటీఆర్ వాడుతున్న భాష కూడా సరిగా లేదని... కేసీఆర్ కొడుకు కాబట్టే కేటీఆర్ అలాంటి భాషను వాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ కు ఇంత అహంకారం ఎందుకని ప్రశ్నించారు.

 హైదరాబాద్ వరద బాధితులకు టీఆర్ఎస్ చేస్తున్న సాయం... జనాలు పన్నుల రూపంలో కట్టిన డబ్బేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల నుంచే ఈ సాయం చేశారని అన్నారు. ప్రజల డబ్బును వారికే ఇస్తూ... టీఆర్ఎస్ ఇస్తున్నట్టు డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు తీసుకుంటున్న జీతాలు కూడా ప్రజల డబ్బేనని అన్నారు.

దుబ్బాకలో టీఆర్ఎస్ కు ఏడు చెరువుల నీళ్లు తాగించామని అర్వింద్ అన్నారు. 'వచ్చే ఎన్నికలలో సిరిసిల్లలో నీవు ఓడిపోకపోతే అడుగు కేటీఆర్' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమ కట్టడాలను కూల్చడంలో ప్రధాని మోదీని చూసి నేర్చుకోవాలని కేటీఆర్ కు సూచించారు. గుజరాత్ సీఎంగా 2 లక్షల అక్రమ కట్టడాలను మోదీ కూల్చారని... పాతబస్తీలో పాన్ దుకాణం తీయాలన్నా కేటీఆర్ కు ప్యాంటు తడుస్తుందని ఎద్దేవా చేశారు.

More Telugu News