తిరుపతిలో 24 గంటలూ ఉచిత దర్శన టోకెన్ల జారీ!
- విష్ణు నివాసంలో ప్రత్యేక కౌంటర్
- స్లాట్స్ ఆధారంగా టికెట్ల జారీ
- భక్తుల సంఖ్యను క్రమంగా పెంచుతున్న టీటీడీ
కరోనా కారణంగా మార్చిలో భక్తులకు దర్శనాలను నిలిపివేసిన దాదాపు ఆరు నెలల తరువాత, తిరిగి దర్శనాలను ప్రారంభించగా, ఇప్పుడిప్పుడే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉచిత దర్శన టోకెన్ల జారీ కేంద్రాలను కూడా పెంచాలని నిర్ణయించామని, కొండపై రద్దీ, అందుబాటులో ఉన్న స్లాట్స్ ఆధారంగా ఇక్కడ దర్శన టోకెన్లు పొందవచ్చని అధికారులు తెలిపారు.