KTR: భవన నిర్మాణ, శిథిల వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ను ప్రారంభించిన కేటీఆర్

  • జీడిమెట్లలో ప్లాంటును ప్రారంభించిన కేటీఆర్
  • సిటీలో మొత్తం 5 ప్లాంట్లను ప్రారంభిస్తామన్న మంత్రి
  • చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయవద్దని కోరిన కేటీఆర్
KTR inaugurates construction waste recycling plant

హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు సరాసరి 2 వేల టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. శిథిలాల నిర్వహణలో సౌతిండియాలోనే తెలంగాణ బెస్ట్ గా ఉందని చెప్పారు. జీడిమెట్లలో నిర్మించిన భవన నిర్మాణ, శిథిలాల వ్యర్థ్యాల రీసైక్లింగ్ ప్లాంటును ఈరోజు కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ప్లాంటు ద్వారా జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేయనున్నట్టు చెప్పారు. ఎల్బీనగర్ లో ని ఫతుల్ గూడలో సంక్రాంతి పండుగ నాడు మరో ప్లాంటును ప్రారంభిస్తామని తెలిపారు. నగరంలో మొత్తం 5 ప్లాంట్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయవద్దని ప్రజలను కోరారు. చెత్త తరలింపు కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 1200 72659కి సమాచారం ఇవ్వాలని చెప్పారు.

More Telugu News