RadheShyam: ఇటలీ వీధుల్లో ప్రభాస్ కొత్త ఫొటోలు.. వైరల్!

  • ప్రభాస్, పూజ హెగ్డే కాంబినేషన్లో 'రాధేశ్యామ్' 
  • ఇటీవల ఇటలీలో షూటింగ్
  • అక్కడ ఫొటోలు దిగిన ప్రభాస్
Latest Pics of Rebel Star Prabhas In Italy RadheShyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న 'రాధేశ్యామ్' సినిమా షూటింగ్ ఇటీవల ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. నెల రోజుల అనంతరం షూటింగ్ పూర్తవడంతో ఇటీవల ఈ సినిమా యూనిట్ భారత్ కు వచ్చింది. తాజాగా, ప్రభాస్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనపడుతున్నాయి.

  
ఇటలీలో షూటింగ్ సమయంలో ఆయన ఈ ఫొటోలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.  ప్రభాకరన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అభిమానులను అలరించాయి.  భారీ బడ్జెట్‌తో యూవీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి గత నెల 23న ప్రభాస్ జన్మదినం సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ను కూడా విడుదలచేశారు. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

More Telugu News