bihar: తల్లిదండ్రులను ఎత్తుకుని పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొస్తోన్న ఓటర్లు.. వీడియోలు ఇవిగో

  • బీహార్ అసెంబ్లీతో పాటు దేశంలోని పలు చోట్ల ఉపఎన్నికలు 
  • మధ్యప్రదేశ్‌లో  చేతుల మీద తల్లిని మోసుకొచ్చిన వ్యక్తి
  • హర్యానాలో తండ్రిని తన వీపుపై మోసుకొచ్చిన ఓటరు
A man carries his elderly mother in his arms to the polling booth

బీహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతోన్న ఉప ఎన్నికల్లో ఓటరు చైతన్యం కనపడింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పోలింగ్ కేంద్రంలో ఓ వ్యక్తి తన తల్లిని చేతుల మీద ఎత్తుకొచ్చి ఓటేయించాడు. మధ్యప్రదేశ్‌లో ఈ రోజు మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

హర్యానాలో ఓ వ్యక్తి తన తండ్రిని తన వీపుపై మోసుకుని భైన్స్వాల్ కలాన్ ఓటింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటు వేయించాడు.  కాగా, బీహార్‌లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోజు ఉదయం 9 గంటలలోపు  8.05 శాతం ఓటింగ్ నమోదయిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి.

More Telugu News