Anupama: రామ్ సరసన మరోసారి అనుపమ పరమేశ్వరన్!

  • తాజాగా 'రెడ్' చిత్రాన్ని పూర్తి చేసిన రామ్ 
  • త్రివిక్రమ్ దర్శకత్వంలో తదుపరి సినిమా
  • కథానాయికగా అనుపమ ఎంపిక
  • నలభై కోట్ల బడ్జెట్టుతో చిత్ర నిర్మాణం  
Anupama Parameshvaran opposite Ram

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కి టాలీవుడ్ నుంచి మరో అవకాశం వచ్చింది. ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన గతంలో 'హలో గురూ ప్రేమ కోసమే' సినిమాలో కథానాయికగా నటించిన ఆమె, ఇప్పుడు మరోసారి అతనితో జతకట్టనుంది.

 తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ 'రెడ్' చిత్రాన్ని చేస్తున్నాడు. ఇది షూటింగు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ ఓ చిత్రం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎన్టీఆర్ తో తాను చేయాల్సిన చిత్రం ఆలస్యమవుతున్న కారణంగా, ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ ఓ చిన్న చిత్రాన్ని రామ్ తో సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిని నలభై కోట్ల బడ్జెట్టుతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఇక ఈ చిత్రంలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ను త్రివిక్రమ్ ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని నిర్మిస్తారని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధమైనట్టు, ప్రస్తుతం ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News