Cash: హైదరాబాదులో రూ.1 కోటి స్వాధీనం... బీజేపీ నేత రఘునందన్ బావమరిది డబ్బు అంటున్న పోలీసులు!

  • హైదరాబాదులో భారీగా నగదు పట్టివేత
  • ఇన్నోవా వాహనంలో కోటి రూపాయలు
  • డ్రైవర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • సెల్ ఫోన్ లో కీలక సమాచారం ఉందన్న సీపీ
Police seize one crore rupees in Hyderabad

దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు ముమ్మరం అయ్యాయి. ఈ క్రమంలో నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.1 కోటి నగదు పట్టుకున్నారు. దీనిపై సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ, బేగంపేట ఫ్లై ఓవర్ సమీపంలో డబ్బు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ డబ్బుకు దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధం ఉందని భావిస్తున్నామని తెలిపారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ బావమరిది సురభి శ్రీనివాసరావుకు చెందిన డబ్బుగా గుర్తించామని చెప్పారు.

ఈ ఘటనలో ఓ ఇన్నోవా వాహనం, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. సెల్ ఫోన్ లో కీలక ఆధారాలు ఉన్నాయని, కారు డ్రైవర్ రవికుమార్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. బేగంపేటలో విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ మేనేజర్ ద్వారా ఈ డబ్బు వచ్చినట్టు తెలుసుకున్నామని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని వివరించారు.

More Telugu News