రాయలసీమ థర్మల్ ప్లాంట్ ను అమ్మడం లేదు: మంత్రి బాలినేని
- విద్యుత్ మీటర్లు బిగించడం వల్ల రైతులకు నష్టం లేదు
- మీటర్లను ఉచితంగానే బిగిస్తాం
- విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం
కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నామని బాలినేని అన్నారు. విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లపై సంఘాలతో చర్చించామని చెప్పారు. ఈరోజు విద్యుత్ ఉద్యోగుల సంఘాలతో బాలినేని చర్చలు జరిపారు. ముఖ్యమంత్రితో చర్చించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.