Corona Virus: ఏపీ కరోనా అప్ డేట్: 2,918 పాజిటివ్ కేసులు, 24 మరణాలు

Pace of corona spreading in AP slowly declines
  • అత్యధికంగా తూర్పుగోదావరిలో 468 కేసులు
  • అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 44 కేసులు
  • తాజాగా 4,303 మందికి కరోనా నయం
ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా నిదానిస్తోంది. వేసవిలో కనిపించిన ఉద్ధృతి ఇప్పుడు లేదనే చెప్పాలి. తాజాగా విడుదలైన కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో 2,918 కొత్త కేసులు వచ్చాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 468 పాజిటిట్ కేసులు రాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 44 మందికి కరోనా నిర్ధారణ అయింది.

అదే సమయంలో ఏపీలో 24 మంది మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,453కి పెరిగింది. తాజాగా 4,303 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,86,050కి చేరుకుంది. 7,44,532 మందికి కరోనా నయం కాగా, ఇంకా 35,065 మంది చికిత్స పొందుతున్నారు.
Corona Virus
Andhra Pradesh
Positive
Deaths

More Telugu News