కరోనా బారినపడిన ఏలూరు ఎంపీ

Eluru MP Kotagiri Sridhar tested corona positive
ఏపీలో కరోనా బారినపడుతున్న ప్రజాప్రతినిధుల జాబితాలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా చేరారు. కోటగిరి శ్రీధర్ కు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఆయన కార్యాలయంలో మరో నలుగురు ఉద్యోగులకు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

ఈ నేపథ్యంలో, గత వారం రోజులుగా తనను కలిసిన వాళ్లు ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోటగిరి శ్రీధర్ సూచించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులో హోం ఐసోలేషన్ లో ఉన్నారు.

నిత్యం జనం మధ్య తిరిగే ప్రజాప్రతినిధులు, నేతలపై కరోనా వైరస్ తన ప్రభావం చూపుతోంది. ఏపీలో మాణిక్యాలరావు, బల్లి దుర్గాప్రసాద్ వంటి రాజకీయప్రముఖులు సైతం ఈ మహమ్మారికి బలవడం విషాదకరం.
Go Back to Shorts
Kotagiri Sridhar
Corona Virus
Positive
Eluru
MP
Isolation

More Telugu News