raj tarun: 'ఒరేయ్‌ బుజ్జిగా' సినిమా ట్రైలర్ విడుదల

  • కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'ఒరేయ్‌ బుజ్జిగా'
  • నాగ చైతన్య చేతుల మీదుగా విడుదల
  • మరోసారి జోడీ కట్టిన రాజ్‌తరుణ్‌, హెబ్బాపటేల్
the trailer of OreyBujjiga releases

కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'ఒరేయ్‌ బుజ్జిగా' సినిమా ట్రైలర్ హీరో నాగ చైతన్య చేతుల మీదుగా ఈ రోజు విడుదలైంది. రాజ్‌తరుణ్‌, హెబ్బాపటేల్ జోడీ మరోసారి ఈ సినిమాలో సందడి చేస్తూ కనపడుతోంది. వీరిద్దరు గతంలో 'కుమారి 21ఎఫ్'‌లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నరేశ్, వాణీ విశ్వనాథ్‌‌, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర కీలక ప్రాత్రల్లో నటించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో విడుదల చేయనున్నారు.  

ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల చేయనున్నట్లు ఈ సినిమా బృందం తెలిపింది. ఈ సినిమాకు విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ సరసన హెబ్బా పటేల్‌తో పాటు మాళవికా నాయర్‌ కూడా నటించింది. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసినందుకు నాగ చైతన్యకు రాజ్‌ తరుణ్‌ శుభాకాంక్షలు తెలిపాడు.  

         

More Telugu News