SP Balasubrahmanyam: 35 ఏళ్ల క్రితం తాను పాడిన పాటను మళ్లీ బాలు పాడితే... ఏ మాత్రమూ తగ్గని గాన మాధుర్యం వీడియో!

  • 'ఇలయ నిల...' అంటూ పాడిన బాలు
  • రెండు వీడియోలు వైరల్
  • అందుకే ఆ గానం చిరస్థాయని కామెంట్లు
No Deference in Balu Voice in 35 Years

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంలోని గాన మాధుర్యం, ఎన్నాళ్లయినా, ఎన్నేళ్లయినా అలాగే నిలిచివుంటుందనడానికి ఈ రెండు వీడియోలే సాక్ష్యం. మూడున్నర దశాబ్దాల క్రితం పాడినా, తాజాగా పాడినా, ఆ గొంతు వీక్షకులకు వీనుల విందే.

దాదాపు 35 సంవత్సరాల క్రితం ఓ వేదికపై ఆయన 'ఇలయ నిల...' అంటూ సాగే ఓ పాటను పాడారు. అదే పాటను తాజాగా మరో స్టేజ్ పై ఆలపించారు. ఆ రెండు వీడియోలూ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పెరిగే వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమేనని ఈ వీడియోలు చూసిన వారు కామెంట్లు పెడుతున్నారు. అందుకే ఆ గానం చిరస్థాయిగా నిలిచిపోతుందని బాలూ పాటలను గుర్తు చేసుకుంటున్నారు.

More Telugu News