Corona Virus: ఏపీ కరోనా అప్ డేట్: 64 మంది మృతి, 8,835 మందికి పాజిటివ్

  • ఉభయ గోదావరి జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు
  • తాజాగా 10,845 మంది డిశ్చార్జి
  • ఇంకా 90,279 మందికి చికిత్స
Corona update for Andhra Pradesh

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 8,835 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 1,421, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,051 కేసులను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,92,760కి చేరింది.

తాజాగా ఏపీలో 64 మంది మృత్యువాత పడ్డారు. దాంతో కరోనా మృతుల సంఖ్య 5,105కి పెరిగింది. రాష్ట్రంలో మరో  10,845 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 90,279 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,97,376 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు.

More Telugu News