కరోనా పరీక్షలపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
- కరోనా సోకిందా? లేదా? అని తెలుసుకునే హక్కు అందరికీ ఉంది
- ప్రైవేట్ ఆసుపత్రులకు రోజుకు 2 వేల పరీక్షలకు అనుమతి ఇవ్వండి
- టెస్టులు చేయించుకునేవారికి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది
కరోనా లక్షణాలు ఉంటేనే ఇప్పటి వరకు ఢిల్లీలో పరీక్షలు నిర్వహించేవారు. లక్షణాలు లేని వారు టెస్ట్ చేయించుకోవాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పుతో నిబంధనలు మారనున్నాయి. ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి రోజు 2 వేల పరీక్షలు నిర్వహించే వెసులుబాటును ప్రైవేట్ ఆసుపత్రులకు కల్పించాలని హైకోర్టు తెలిపింది. వాలంటరీగా టెస్టులు చేయించుకోవాలనుకునే వారు అక్కడకు వెళ్లి చేయించుకుంటారని చెప్పింది.