Corona Virus: ఏపీ కరోనా అప్ డేట్: 5 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు

  • తాజాగా 8,368 మందికి పాజిటివ్
  • 5,06,493కి పెరిగిన మొత్తం కరోనా కేసులు
  • మరో 70 మంది మృతి
Corona positive cases crosses five lakhs in AP

చైనాలో పుట్టిన కరోనా వైరస్ భూతం భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. అనేక రాష్ట్రాలను ఈ మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఏపీలోనూ ఈ వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 8,368 కొత్త కేసులు రావడంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఇప్పటివరకు ఏపీలో 5,06,493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 70 మంది మరణించారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 10 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,487కి పెరిగింది. రాష్ట్రంలో నేటికి 4,04,074 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 97,932 మంది చికిత్స పొందుతున్నారు.

More Telugu News