DK Shivakumar: మళ్లీ ఆసుపత్రిలో చేరిన కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్!

  • ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న శివకుమార్
  • తాజాగా జ్వరంతో బాధపడుతున్న వైనం
  • కరోనా బారిన పడుతున్న పలువురు నేతలు
DK Shivakumar hospitalised for second time

కర్ణాటక పీసీసీ అధినేత, ఆ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ మళ్లీ ఆసుప్రతిలో చేరారు. గత నెలలో కరోనా బారిన పడిన డీకే... బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఆయనకు మళ్లీ జ్వరం రావడంతో... ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆయన కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఆ రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయవేత్తలు దీని బారిన పడ్డారు. వీరిలో సీఎం యడియూరప్ప, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పలువులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

More Telugu News