Atchannaidu: శ్రీవారి సేవలో అచ్చెన్నాయుడు.. సాదర స్వాగతం పలికిన టీటీడీ అధికారులు

  • ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అరెస్ట్
  • ఐదు రోజుల క్రితమే బెయిులుపై విడుదల
  • వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్న అచ్చెన్న
TDP Leader Atchannaidu visits Tirumala

టీడీపీ నేత, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై అరెస్ట్ అయిన అచ్చెన్న ఐదు రోజుల క్రితం బెయిలుపై విడుదలయ్యారు. తాజాగా, ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన అచ్చెన్నకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అచ్చెన్నకు అందజేశారు.

More Telugu News