Tunnel: భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో సొరంగాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ దళాలు

Tunnel at Samba region found by BSF in border area
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ వైపు నుంచి భారత్ లో ప్రవేశించేందుకు ముష్కర మూకల ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. భారత భద్రతా బలగాలు ఆ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు వమ్ము చేస్తుండడం తెలిసిందే. తాజాగా, సరిహద్దుల్లో భద్రతా విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ దళాలు సాంబా ప్రాంతంలో ఓ సొరంగాన్ని కనుగొన్నాయి.

జమ్మూ సమీపంలోని అంతర్జాతీయ సరిహద్దు కింది భాగంలో దీన్ని గుర్తించారు. ఈ సొరంగం పాకిస్థాన్ వైపు నుంచి తవ్వినట్టు తెలుసుకున్నారు. సరిహద్దు పొడవునా ఉగ్రవాదులు ఏర్పాటుచేసుకునే ఇలాంటి రహస్య నిర్మాణాలను గుర్తించేందుకు బీఎస్ఎఫ్ దళాలు ఇవాళ తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లోనే సొరంగం బయటపడింది.

ఇది 3 నుంచి 4 అడుగుల వెడల్పు ఉందని, 50 మీటర్ల పొడవు ఉందని అధికారులు తెలిపారు. అంతేకాదు, ఆ సొరంగంలో 10 ఇసుక మూటలను కూడా గుర్తించారు. వాటిపై పాక్ కు చెందిన చిహ్నాలు ఉన్నాయని, ఈ సొరంగం ఉగ్రవాదులు, మాదక ద్రవ్యాల స్మగ్లర్ల కోసం ఏర్పాటు చేసి ఉంటారని బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి.
Go Back to Shorts
Tunnel
Samba
BSF
India
Pakistan
Border

More Telugu News