KCR: గవర్నర్ తమిళిసైని పరామర్శించిన కేసీఆర్

  • నిన్న కన్నుమూసిన తమిళిసై చిన్నాన్న
  • రాజ్ భవన్ కు వెళ్లి కేసీఆర్ పరామర్శ
  • తమిళిసై తండ్రికి కూడా స్వల్ప అస్వస్థత
KCR meets Gov Tamilisai

తెలంగాణ గవర్నర్ తమిళిసైను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. తమిళిసై చిన్నాన్న, కన్యాకుమారి పార్లమెంటు సభ్యుడు వసంతకుమార్ నిన్న కరోనాతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో, కేసీఆర్ ఈరోజు రాజ్ భవన్ కు వెళ్లారు. ఆమెను పరామర్శించారు. మరోవైపు తమిళిసై తండ్రి అనంతన్ సైతం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం గురించి కూడా కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు సెప్టెంబర్ 7 నుంచి 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లారు. సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి, పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ తీర్మానం చేయనున్న విషయాలను వివరించారు.

More Telugu News