Roja: పెళ్లిరోజు సందర్భంగా సీఎం జగన్ ఆశీస్సులు అందుకున్న రోజా దంపతులు
ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇవాళ తన పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆశీస్సులు అందుకున్నారు. రోజా, సెల్వమణి దంపతులపై అక్షింతలు చల్లిన సీఎం జగన్ వారిని దీవించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

.

.