Narendra Modi: శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరగడం దురదృష్టకరం: మోదీ

  • శ్రీశైలం పవర్ హౌస్ లో దుర్ఘటన
  • 9 మంది మృత్యువాత
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని
PM Modi says Srisailam powerhouse incident very unfortunate

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో తీవ్ర ప్రమాదం జరగ్గా, 9 మంది బలయ్యారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ట్విట్టర్ లో తెలిపారు.

More Telugu News