కరోనా కేసుల్లో నేనూ చేరాను.. కరోనా బారినపడిన తర్వాత కిరణ్ మజుందార్ షా ట్వీట్
- స్వయంగా ట్వీట్ చేసి వెల్లడించిన బయోకాన్ ఎండీ
- స్వల్ప లక్షణాలే ఉన్నాయని, త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం
- త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖుల ట్వీట్లు
అయితే, డీజీసీఐ నిర్ణయం వివాదాస్పదమైంది. కేవలం నాలుగు కొవిడ్ కేంద్రాలలో 30 మంది రోగులపై క్లినికల్ ట్రయల్స్ జరిపి, దాని ఆధారంగా ఇటోలిజుమాబ్ తయారీకి అనుమతి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, తనకు కరోనా సోకిన విషయాన్ని కిరణ్ స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. తాను కూడా కరోనా కేసుల్లో చేరిపోయానని అయితే, లక్షణాలు మాత్రం స్వల్పంగానే ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలోనే కరోనా నుంచి తాను బయటపడతానని ఆశాభావం వ్యక్తం చేశారు.