నిజాయతీగా పన్నులు చెల్లించేవారికి లబ్ధి చేకూర్చే 'పారదర్శక పన్నుల విధాన వేదిక' తీసుకువచ్చాం: మోదీ
- పన్నుల చెల్లింపు విధానంలో నూతన సంస్కరణలు
- నేరుగా హాజరయ్యే అవసరంలేని కొత్త విధానం
- నిజాయతీపరులను గౌరవించడమే దీని ఉద్దేశమన్న మోదీ
ఈ సరికొత్త విధానం దేశ పౌరులందరికీ సెప్టెంబరు 25 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఈ విధానం ద్వారా పన్నుల వ్యవస్థ సరికొత్త పంథాను అందిపుచ్చుకుంటుందని, ఎంతో సులభతరం అవుతుందని మోదీ వివరించారు. "నిజాయతీపరులను గౌరవించడం ఈ విధానం ముఖ్య ఉద్దేశం. ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సమస్యలు ఉత్పన్నం కాని రీతిలో లావాదేవీలు మా పారదర్శక పన్నుల విధాన వేదిక లక్ష్యం. ఈ ముఖ రహిత విధానంలో... పన్నులు చెల్లిస్తున్నది ఎవరు, పన్నుల అధికారి ఎవరన్నది ముఖ్యం కాబోదు" అని వివరించారు.