Raghurama Krishnaraju: పోస్టులన్నీ ఒకే సామాజిక వర్గానికా?... 'మళ్లీ  ఏసేశాడు' అంటూ రఘురామకృష్ణరాజు కామెడీ డైలాగ్!

  • వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేసిన నరసాపురం ఎంపీ
  • అర్హతలు లేకపోయినా ఒక సామాజిక వర్గానికి పెద్దపీట అంటూ విమర్శలు
  • మంచి చేస్తే మూడు దశాబ్దాలు ఉంటారంటూ హితవు
MP Raghurama Krishnaraju slams YCP Government on key post appointments

ఏపీలో ఒక సామాజిక వర్గానికే అత్యధిక పోస్టులు లభిస్తున్నాయని, కీలక స్థానాల్లో వాళ్లే ఉన్నారంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. అర్హతలు లేకపోయినా కేవలం ఓ సామాజిక వర్గం వారికే పోస్టులు ఇస్తున్నారని, ఎక్కడైనా రెండు పోస్టులు ఉంటే ఒకటి ఆ సామాజిక వర్గానికి, రెండోది ఇతరులకు ఇస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన 'దూకుడు' సినిమాలో మహేశ్ బాబు పలికిన "హే మళ్లీ ఏసేశాడు" అనే డైలాగును ఉపయోగించారు. మంచి చేస్తే మూడు దశాబ్దాలు ఉంటారని, ఈ విషయం సీఎం జగన్ ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు... ఏపీలో అత్యధిక పోస్టుల్లో కొనసాగుతున్న ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి పేర్లను చదివి వినిపించారు.

More Telugu News