Corona Virus: దేశంలో ఒక్కరోజులో 66,999 కరోనా కేసులు

  • మొత్తం కేసులు 23,96,638
  • మృతుల సంఖ్య మొత్తం 47,033
  • 6,53,622 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న వారు 16,95,982 మంది  
Spike of 66999 cases and 942 deaths reported in India

దేశంలో కరోనా ఉద్ధృతి, మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. భారత్‌లో 24 గంటల్లో 66,999 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 942 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.  
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 23,96,638కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 47,033 కి పెరిగింది. 6,53,622 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 16,95,982 మంది కోలుకున్నారు.
                                                 
కాగా, నిన్నటి వరకు మొత్తం 2,68,45,688 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 8,30,391 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.

More Telugu News