Corona Virus: దేశంలో కరోనా ఉద్ధృతి.. 21 లక్షల దాటిన కేసులు

  • 64,399 మందికి కొత్తగా కరోనా 
  • మొత్తం కేసులు 21,53,011
  • మృతుల సంఖ్య మొత్తం 43,379
  • 6,28,747 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
Single day spike of 64399 cases

దేశంలో కొవిడ్‌-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 64,399 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 861 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 21,53,011కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 43,379కి పెరిగింది. 6,28,747  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 14,80,885 మంది కోలుకున్నారు.
 
కాగా, నిన్నటి వరకు మొత్తం 2,41,06,535 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 7,19,364  శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.

More Telugu News