Corona Virus: తెలంగాణలో మరో 1982 మందికి సోకిన కరోనా

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,495
  • ఆసుపత్రుల్లో 22,869 మందికి చికిత్స
  • కోలుకున్న 55,999 మంది
  • మృతుల సంఖ్య మొత్తం 627
coronavirus cases in telangana

తెలంగాణలో కొవిడ్‌-19 కేసుల విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1982 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1669 మంది కోలుకోగా, 12 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.  

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,495కు చేరింది. ఆసుపత్రుల్లో 22,869 మందికి చికిత్స అందుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 55,999 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 627కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 463కరోనా కేసులు, రంగారెడ్డి జిల్లాలో 139 కేసులు నమోదయ్యాయి.                   
                          .

More Telugu News