3 Capitals: మూడు రాజధానులపై సుప్రీంకోర్టులో స్టే వెకేషన్ పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం

  • రాజధాని వికేంద్రీకరణపై స్టే విధించిన హైకోర్టు
  • హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్
  • సోమవారం విచారణకు వచ్చే అవకాశం
AP Govt files Stay Vacation Petition in Supreme Court

పాలనా వికేంద్రీకరణ (మూడు రాజధానులు), సీఆర్డీఏ రద్దు అంశాలపై ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టే వెకేషన్ పిటిషన్ ను దాఖలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ఇప్పటికే ఐకాస, అమరావతి రైతులు కేవియట్ దాఖలు చేశారు.

More Telugu News