Ambulance: కరోనా నేపథ్యంలో అంబులెన్సులు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన తెలంగాణ ప్రజాప్రతినిధులు

  • అంబులెన్స్ లు కొనేందుకు ఆసరా
  • చెక్ లను కేటీఆర్ కు అందించిన నేతలు
  • అత్యధికంగా 6 అంబులెన్స్ లకు విరాళం ఇచ్చిన మంత్రి మల్లారెడ్డి
Telangana Legislative members donates for purchasing ambulances

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అక్కడి ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అంబులెన్స్ లు కొనేందుకు ప్రభుత్వానికి విరాళాలు ఇస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి అత్యధికంగా 6 అంబులెన్స్ లు కొనుగోలు చేసేందుకు విరాళం అందించారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 2, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 2, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ 2, ఎమ్మెల్సీ రాజు 1, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్ 1 చొప్పున అంబులెన్సుల కోసం చెక్ లను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అందించారు.

More Telugu News